ఆగ్రహంతో 'మహర్షి' చిత్రబృందం తీసుకున్న కీలక నిర్ణయం

Update: 2019-01-30 06:21 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని 25వ సినిమా గా తెరకెక్కనున్న 'మహర్షి' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. విదేశాల్లో పెద్ద వ్యాపారవేత్త గా చలామణి అవుతున్న ఒక వ్యక్తి స్నేహితుడి కోసం తిరిగి భారతదేశం వచ్చి వ్యవసాయం చేసే పాత్రలో కనిపించనున్నాడు మహేష్.

అయితే ఈ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరణ జరుగుతున్న కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియో లో మహేష్ బాబు పచ్చని పొలాల మధ్యలో నిలబడి మీడియాతో ముచ్చటిస్తూ ఉన్నట్లు కనిపిస్తాడు. అది సినిమాలో ఒక సన్నివేశం. ఈ సన్నివేశం నిజానికి సినిమా మొత్తంలో కీలకమని తెలుస్తోంది. అది లీక్ అవడంతో ఆగ్రహం చెందిన చిత్ర బృందం బయట నుంచి లోపలికి ఎవరు రాకూడదని ఎవరు సెట్స్ లో సెల్ఫోన్లు వాడకూడదని నిబంధనలు పెట్టాలని నిర్ణయించారు.

Similar News