ఎన్టీఅర్ మార్గ్ చేరుకున్న ఖైరతాబాద్ గణేశుడు

ప్రతిష్టాత్మాక ఖైరతాబాద్ గణేశుడు ఎన్టీఅర్ మార్గ్ వద్దకు చేరుకున్నాడు.

Update: 2019-09-12 06:19 GMT
ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనానికి సమయం దగ్గరపడుతోంది. కోలాహలంగా ఈ ఉదయం ప్రారంభమైన ఈ మహా గణపతి శోభా యాత్ర టాంక్ బ్యాండ్ సమీపంలోకి చేరుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ లో ముందుకు కదులుతోంది. అధికారులంతా సమన్వయంతో వ్యవహరించి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం వేగంగా జరిగేలా ప్రణాళిక రచించారు. అందుకు తగ్గట్టుగానే కార్యక్రమం మొత్తం సాగింది. అధికారుల వ్యూహరచన్ ఫలించి మహా గణపతి మహా నిమజ్జనం త్వరగా పూర్తయ్యే అవకాశం కలిగింది. మరి కొన్ని గంటల్లో వినాయకుని నిమజ్జనం పూర్తీ అయ్యే అవకాశం ఉంది. 

Similar News