Sri Lanka - Economic Crisis: శ్రీలంకలో మరింత ముదురుతున్న ఆర్థిక సంక్షోభం

Sri Lanka - Economic Crisis: *శ్రీలంక వ్యాప్తంగా హోరెత్తుతున్న ప్రజల నిరసనలు *మంత్రులు, అధికారుల రాజీనామాల పర్వం

Update: 2022-04-06 04:56 GMT

Sri Lanka - Economic Crisis: శ్రీలంకలో మరింత ముదురుతున్న ఆర్థిక సంక్షోభం

Sri Lanka - Economic Crisis: శ్రీలంకలో రోజురోజుకి ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. కేజీ పాల ప్యాకెట్ ధర వేయి 900 రూపాయలకు చేరింది. కేజీ బియ్యం 220, చక్కెర 240 రూపాయలు కాగా.., లీటర్ కొబ్బరి నూనె ధర 850 రూపాయలు పలుకుతుంది. అంతేకాదు కేజీ యాపిల్స్ ధర వేయి రూపాయలను టచ్ చేసింది. దీంతో శ్రీలంక వ్యాప్తంగా ప్రజల నిరసనలు హోరెత్తుతున్నాయి.

మరోవైపు శ్రీలంకలో మంత్రులు, అధికారుల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. పదవి చేపట్టిన ఒక్కరోజుకే ఆర్థిక శాఖకు రాజీనామా చేశారు అలీ సబ్రీ. ఇదిలా ఉండగా మంత్రివర్గంలోకి రావాలన్న ప్రధాని రాజపక్స ఆహ్వానాన్ని విపక్షాలు తిరస్కరించాయి.

Tags:    

Similar News