జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో మోడీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

PM Modi: మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన మోడీ

Update: 2022-09-27 06:37 GMT

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో మోడీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

PM Modi: టోక్యోలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. జపాన్‌ మాజీ షింజో అబే మృతి పట్ల మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇండియా-జపాన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను షింజో అబే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. షింజో అంత్యక్రియలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ జపాన్ కు వెళ్లారు.

Full View


Tags:    

Similar News