New Zealand: భారతీయులకు న్యూజిలాండ్ నో ఎంట్రీ
New Zealand: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు తమ దేశంలోకి అనుమతించరాదని న్యూజిలాండ్ నిర్ణయించింది.
Jacinda Kate Laurell Ardern
New Zealand: భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు తమ దేశంలోకి అనుమతించరాదని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఈ నెల11 సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్ ప్రధాని వెల్లడించారు. ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్కు వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా.. అందులో 23 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 17 మంది భారత్ నుంచి వచ్చినవారే కావడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.