Earthquake Tsunami Alert: భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక! జలప్రళయం తప్పదా?
Earthquake Tsunami Alert: జపాన్ తీర ప్రాంతం మరోసారి భూకంప ప్రకంపనలతో కదిలిపోయింది. ఆదివారం సాయంత్రం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇవాటే ప్రిఫెక్చర్కు సునామీ హెచ్చరిక జారీ అయ్యింది.
Earthquake Tsunami Alert: భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక! జలప్రళయం తప్పదా?
Earthquake Tsunami Alert: జపాన్ తీర ప్రాంతం మరోసారి భూకంప ప్రకంపనలతో కదిలిపోయింది. ఆదివారం సాయంత్రం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇవాటే ప్రిఫెక్చర్కు సునామీ హెచ్చరిక జారీ అయ్యింది. ది జపాన్ టైమ్స్ ప్రకారం, జపాన్ వాతావరణ సంస్థ ఈ హెచ్చరికను విడుదల చేసింది. తీరప్రాంతంలో ఒక మీటరు ఎత్తు వరకు అలలు విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
సాయంత్రం 5.03 గంటలకు నమోదైన ఈ భూకంపం ప్రభావం మొరియోకా నగరం, యహబా పట్టణంలో స్పష్టంగా అనుభవించబడింది. షిండో 4 స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్హెచ్కె ప్రజలను తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో, ఇవాటే తీరం నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 5.12 గంటలకు సునామీ తరంగం గమనించబడిందని తెలిపింది. ఇది త్వరలో పసిఫిక్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక భారత ఉపఖండం పక్కనే ఉన్న అండమాన్ సముద్రంలో కూడా ఆదివారం భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం (National Center for Seismology) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత 5.4గా నమోదైంది. మధ్యాహ్నం 12:06 గంటలకు ఈ వణుకు సంభవించిందని, లోతు సుమారు 90 కిలోమీటర్లు అని వివరించారు. అయితే జర్మనీకి చెందిన జిఎఫ్జెడ్ (German Research Centre for Geosciences) మాత్రం భూకంప తీవ్రతను 6.07గా, లోతును 10 కిలోమీటర్లుగా నమోదు చేసింది.
ఈ వణుకు అండమాన్ నికోబార్ దీవుల పలు ప్రాంతాల్లో అనుభవించబడింది. అయితే, ఎక్కడా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వారు వెల్లడించారు.
జపాన్ తీరంలో సునామీ భయం ఇంకా కొనసాగుతుండగా, అండమాన్ ప్రాంతం మాత్రం సురక్షితంగా ఉందని అధికారులు వెల్లడించారు.