చిక్కడపల్లిలో కిడ్నాప్ కలకలం

Update: 2019-07-29 03:18 GMT

చిక్కడపల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేకెత్తించింది. ఆదివారం రాత్రి వ్యాపారి గజేంద్ర ప్రసాద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారు 3 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కోటి రూపాయలు కిడ్నాపర్లకు ఇచ్చినట్టు తెలిసింది. కోటి రూపాయలు అందుకున్న అనంతరం గజేంద్ర ప్రసాద్ ను అబిడ్స్ ప్రనతంలో కిడ్నాపర్లు వదిలిపెట్టారు.

కాగా, ఈ వ్యవహారం పై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి గజేంద్ర ప్రసాద్ కు ముంబాయి వ్యాపార వేత్తలతో లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Tags:    

Similar News