రాజీనామా లేఖలు సిద్ధం చేసిన వైసీపీ ఎంపీలు

Update: 2018-04-06 05:30 GMT

వైసీపీ ఎంపీలు రాజీనామా లేఖలతో పార్లమెంట్‌కు వచ్చారు. సభ నిరవధికంగా వాయిదా పడిన వెంటనే స్పీకర్‌కు రాజీనామా లేఖలు అందిస్తామని ఎంపీలు ప్రకటించారు. రాజీనామాల అనంతరం నేరుగా ఏపీ భవన్‌కు చేరుకోనున్న ఎంపీలు అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఎంపీల దీక్షకు సంఘీభావంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకున్నారు.  
 

Similar News