విశాఖ జిల్లా మోదుగులలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన ... కార్యకర్తలు, అభిమానులతో కలిసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులతో స్వయంగా జగన్ ఉట్టి కొట్టించడంతో కార్యక్రమం సందడిగా జరిగింది.