వైసీపీ ఆటలు తన దగ్గర సాగవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కోడి కత్తి డ్రామాకు తెరలేపారని విమర్శించిన చంద్రబాబు వైసీపీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైతే కనీసం పరామర్శించడానికి కూడా ప్రతిపక్ష నేత రాలేదని విమర్శించారు. సాయం చేయాల్సిన కేంద్రం కనీసం స్పందించలేదని చంద్రబాబు మండిపడ్డారు.