మహేశ్వరంలో అత్తాపూర్ తరహా హత్య..

Update: 2018-10-07 06:19 GMT

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో జరిగిన హత్యను మరవకముందే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో మరో హత్య జరిగింది. ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు దుండగులు. నాగారం ప్రధాన కూడలిలో పోట్ల రాజు అనే యువకుడిని దుండగులు నరికి చంపారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడిని దుండగులు హత్య చేశారు. రెండేళ్ల క్రితం రాజు స్నేహితుడు కృష్ణ  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అప్పటినుంచి కృష్ణ కుటుంబ సభ్యులు రాజుపై కక్షగట్టారు. అందులో భాగంగానే రాజును హతమర్చినట్టు తెలుస్తోంది. 

Similar News