ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ప్రియాంక చదువు పూర్తిచేసుకుని మార్కాపురంలో ఉద్యోగ పరీక్షకోసం శిక్షణ తీసుకుంటోంది. ఆమెకు మార్కాపురానికి చెందిన మహేష్ పరిచయమయ్యాడు. దీంతో వారు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నాడని ప్రియాంక ఆరోపిస్తోంది. దీంతో మహేష్ ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగింది. పోలీసులు సమాచారం అందుకుని ఆమెను పోలీసుస్టేషన్కు పిలిపించారు. తల్లిదండ్రులు యాకోబు, రంగమ్మలు తమ కుమార్తెకు న్యాయం చేయాలని
మహేష్ పై ఫిర్యాదు చేశారు.