శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నిన్న(గురువారం) మహిళ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన సాయిప్రసన్నను తన భర్త జైపూర్లో విమానం ఎక్కించారు. ఆమెకోసం తండ్రి,తమ్ముడు ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తున్నారు. ఇంతలోహైదారబాద్కు చేరుకున్నసాయిప్రసన్న వారికి తెలియకుండానే క్యాబ్ మాట్లాడుకుని ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. వెళుతూ వెళుతూ తన తమ్ముడికి ఫోన్ చేసి తనకోసం వెతకొద్దని తెలిపింది. దీంతో భయాందోళన చెందిన సాయిప్రసన్న తండ్రి ఈ విషయాన్ని వెంటనే భర్తకు చెప్పాడు. అతను ఖమ్మంకి చెందిన మోహన్ రావు అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.దీనిపై సదరు మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.