వివాహేతర సంబంధానికి మరో వ్యక్తి బలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ శివరాంపల్లిలో జరిగింది. .వికారాబాద్ జిల్లా, కొడంగల్ మండలం, లింగంపల్లికి చెందిన ఆనంద్(32)కు హైదరాబాద్ పురానాపూల్కు చెందిన మహేశ్వరితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. బతుకుదెరువు నిమిత్తం ఏడేళ్ల క్రితం ఆనంద్ కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది. శివరాంపల్లిలో ఉంటూ ఓ హోటల్లో కుక్గా పని చేస్తున్నాడు ఆనంద్. భార్య మహేశ్వరికి గంధంగూడకు చెందిన డ్రైవర్ అంజూతో ఏర్పడి పరిచయం కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. వారి అనైతిక బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మహేశ్వరి రెండు నెలల కిందట ప్రియుడి సాయంతో భర్త మెడకు ఉరి వేసి హతమార్చింది. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని దహనం చేశారు. అయితే మృతుడి సోదరుడు కాశప్ప ఆనంద్కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవకపోవడంతో మే 5న వారి ఇంటికి వచ్చాడు. మహేశ్వరి ఒక్కతే కనిపించడంతో ఆనంద్ విషయం ఆరా తీశాడు. మూడు రోజుల క్రితం పనికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన అతను ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పింది. దీంతో కాశప్ప రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు నెలలుగా అతని జాడకోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఆనంద్ భార్య మహేశ్వరీని కూడా విచారించడంతో ఆమె తన ప్రియుడు మరో నలుగురు యువకులు సహాయం తీసుకుని హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో మహేశ్వరీ, అంజూ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు