ఉపరాష్ట్రపతి కాన్వాయ్‌కి అపశృతి

Update: 2018-08-23 04:09 GMT

విజయవాడలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాన్వాయ్‌ వెళ్తుండగా అపశృతి చోటుచేసుకుంది. గన్నరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన వెంకయ్య నాయుడు కాన్వాయ్ లోని చివరి వాహనం చైతన్య స్కూల్ వద్ద బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.. కారు డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.  కాన్వాయ్ పూర్తిగా వెళ్లక ముందే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను వదిలి వేయడంతో ఘటన చోటు చేసుకుంది.  

Similar News