తెలుగుదేశం మహానాడులో రెండోరోజు ఓ బుడ్డోడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శాతకర్ణి గెటప్లో మహానాడుకు వచ్చిన ఈ బుడ్డోడు... బాలయ్య తరహాలో డైలాగ్లు పేల్చాడు. శరణమా? రణమా? అంటూ కేంద్రానికి హెచ్చరికలు పంపిన ఈ చిన్నోడు... తమది బడుగు జాతి కాదు తెలుగు జాతి అంటూ పేల్చిన డైలాగ్లు... వేదికపై ఉన్నవారందరినీ ఆకట్టుకున్నాయి. ఇక జగన్, విజయసాయిరెడ్డి టార్గెట్గా పేల్చిన డైలాగ్లను వింటూ చంద్రబాబు పడిపడి నవ్వారు. చంద్రబాబు వల్లే అమరావతి అభివృద్ధి సాధ్యమని అంగీకరించి.... జైల్లో విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్పై సెటైర్లు పేల్చాడు ఈ బుడ్డోడు.