అగ్నికి ఆహుతైన కుటుంబం...

Update: 2018-11-11 11:07 GMT

వారికదే చివరిరాత్రి అయ్యింది. పడుకున్నవారు పడుకున్నట్లే సజీవదహనం అయ్యారు. తెల్లవారే సరికి బూడిదగా మిగిలారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో భార్య భర్తతో పాటు ఇద్దరు పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. అయితే వీరిది హత్యా, లేక ఆత్మహత్యా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్‌ సర్క్యూటే కారణమని పోలీసులు చెబుతుంటే కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే వీరి మరణానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. 
 

Similar News