టీటీడీపీ మేనిఫెస్టో విడుదల

Update: 2018-11-21 08:11 GMT

తెలంగాణ టీడీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మేనిఫెస్టోను విడుదల చేశారు. అమరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగంతో పాటు సొంత ఇంటి కోసం 10 లక్షల సాయం చేయడం, రైతులకు 2లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు 3వేలు భృతి కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అనంతరం రమణ మీడియాతో మాట్లాడరు. అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి టీడీపీ మేనిఫెస్టోను రూపకల్పన చేశామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ మేనిఫెస్టో రూపొందిందని వివరించారు. ఇందులో అత్యంత ప్రాధాన్య అంశంగా రైతంగ సమస్యలను పేర్కొనట్లు వెల్లడించారు.

Similar News