తెలంగాణలో కమలం పువ్వు ఎపుడో వాడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని బీజేపీకి టీఆర్ఎస్ సవాల్ విసిరింది. మంత్రి కేటీఆర్పై రాంమాధవ్ చేసిన అవినీతి ఆరోపణలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మగతనం గురించి అనుచితంగా మాట్లాడిన రాం మాధవ్... తెలంగాణ విడిచి వెళ్ళకముందే బేషరతుగా క్షమాపణ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏపాటిదో గతంలో జరిగిన ఎన్నికల్లోనే తేలిపోయిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.