జనగామ జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ షాక్ ...టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన...
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో టీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అసమ్మతి నేత రాజారపు ప్రతాప్.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తన నిర్ణయాన్ని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రతాప్.. బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా స్టేషన్ ఘన్పూర్లో పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు.