టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ...ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయలు

Update: 2018-09-21 07:39 GMT

అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామంలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన గొడవ.. రాళ్ల దాడికి దారి తీసింది. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి  చెందిన వ్యక్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరమణగా గుర్తించారు. నాగ రంగయ్య పరిస్థితి విషమంగా ఉంది.. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు.. ఘర్షణకు దారి తీసినపరిస్థితులపై ఆరా తీస్తున్నారు.  

Similar News