అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పుట్లూరు మండలం కుమ్మనమల గ్రామంలో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన గొడవ.. రాళ్ల దాడికి దారి తీసింది. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరమణగా గుర్తించారు. నాగ రంగయ్య పరిస్థితి విషమంగా ఉంది.. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు.. ఘర్షణకు దారి తీసినపరిస్థితులపై ఆరా తీస్తున్నారు.