పొత్తుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం

Update: 2018-09-09 13:17 GMT

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా పొత్తులపై చర్చ జరిగింది. దీంతో  మూడు కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రచార కమిటీ, సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కమిటీలో ఎవరెవరిని సభ్యులుగా నియమించాలనే దానిపై, మరోసారి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో సమావేశం కానున్నారు.  పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇవాళ  సీపీఐ, సోమవారం తెలంగాణ జనసమితితో టీటీడీపీ నేతలు సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Similar News