టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు...21 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా

Update: 2018-10-01 10:13 GMT

కడప జిల్లా టీడీపీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో టీడీపీ ఆధిపత్యపోరు రచ్చకెక్కింది. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ 22 మంది టీడీపీ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వరదరాజుల రెడ్డిని పార్టీ  నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. మున్సిపల్ ఛైర్మన్‌కు రాజీనామాలు సమర్పించిన అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వరద రాజుల రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Similar News