నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనపై నిర్భయతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యారు. ఇంటికి తాళాలు వేసి పరారు కావడంతో పోలీసులు గాలిస్తున్నారు. మూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, బాధిత విద్యార్థినులు మాత్రం సంజయ్ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నారు.