జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. నేటితో జగన్ పాదయాత్ర 74వ రోజుకు చేరుకుంది. ఇవాళ గూడూరు మండల శివారు నుంచి యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర నేటితో వెయి కిలోమీటర్లు పూర్తి కానుండటంతో వైఎస్ జగన్కు సంఘీభావం తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర ఇవాళ్టీతో వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంటుంది. జగన్ వెయి కిలోమీటర్లు యాత్ర పూర్తి కానుండటంతో సైదాపురం గ్రామస్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైదాపురంలో 25 అడుగుల విజయ సంకల్ప స్థూపాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్థులు జగన్కు స్వాగతం పలుకుతూ గ్రామం నిండి ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేశారు.