సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం జరుగుతున్నా మహిళా జూనియర్ ఆర్టిస్ట్ల పై లైంగిక దాడులు ఆగడం లేదు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన ఓ యువతి హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ హాస్టల్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళేది. ఈ క్రమంలో ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న యువతికి రాజ్కిరణ్ అనే ఆర్టిస్ట్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్లో చేరాడు. సినిమాల్లో అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరు ‘మన’ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేశారు. అయితే సభ్యత్వం పేరిట వసూలు చేసిన డబ్బుల విషయంలో వివాదం ఏర్పడింది. ఇది మనసులో పెట్టుకున్న రాజ్ కిరణ్ పథకం పన్నీ, మరో ముగ్గురితో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు పిర్యాదు మేరకు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.