పిల్లలను ఎక్కువగా కనండి : సీఎం చంద్రబాబు

Update: 2018-01-05 11:30 GMT

పిల్లలను ఎక్కువగా కనమని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణ పాటించే రోజులు పోయాయని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జపాన్, యూరప్ దేశాల్లో జనాభా తగ్గడంతో మానవ వనరులు కొరత ఏర్పడిందని, ఆ దుస్థితి మన దేశానికి రావొద్దన్నారు. ఒకప్పుడు తాను కుటుంబ నియంత్రణ పాటించానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. 

Similar News