నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాక్ష్యాత్తు ఓ మహిళ సర్పంచ్ కుల బహిష్కరణకు గురైంది. సర్పంచ్ కుటుంబంతో మాట్లాడినా, వాళ్లకు సహాయం చేసినా ఐదు వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. ఈ ఘటన మెండోరా మండలం బుస్సాపూర్ లో చోటుచేసుకుంది. గ్రామంలోని మూడుఎకరాల భూమి విషయంలో సర్పంచ్ కుటుంబానికి, గురడీ రెడ్డి సంఘాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో సర్పంచ్ని గ్రామం నుంచి వెలివేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని నిజామాబాద్ కలెక్టర్ కు తరలొచ్చారు బుస్సాపూర్ గ్రామ సర్పంచ్.