సంక్రాంతి పండుగకు మూడు రోజుల పాటు కోడిపందేలు నిర్వహించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఒక పక్క చట్టాలను గౌరవిస్తూనే, మరో పక్క అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.