రెండు కార్లు ఢీకొని ఏడుగురి మృతి

Update: 2018-02-21 04:22 GMT

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీ కొనడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 44 వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. అతివేగంతో వస్తున్న ఓ కారు.. డివైడర్ పైకెక్కి.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. 

Similar News