రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దాంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని హైదరాబాద్కు తరలించారు.మృతులు చెన్నారెడ్డిగూడెంకు చెందిన మమత, సుజాత, ఆంబోతు అసలీ, మారు, డ్రైవర్ వంగలా శ్రీనుగా గుర్తించారు. కారు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.