ఛత్తీస్ఘడ్లో మావోయిస్టుల భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. కిడారి హత్య జరిగి 24 గంటలు గడవక ముందే.. మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఆయుధ డంప్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఏడుగురు మావోలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రజా ప్రతినిధులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు, పైప్బాంబ్స్ నిర్వీర్యం చేశారు. పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నారు.