జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా రెండో రోజు కూడా తిరుమలలోనే బసచేశారు. నిన్న స్వామి వారిని దర్శించుకున్న ఆయన రెండో రోజు చుట్టుపక్కల ఆలయాలను దర్శించుకున్నారు. జాపాలి హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాపవినాశనంతో పాటు ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.