డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డికి నిరసనల సెగ

Update: 2018-11-01 08:15 GMT

టీఆర్ఎస్‌ అభ్యర్థులకు గ్రామాల్లో నిరసన సెగలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది. మెదక్‌ జిల్లా శివాయిపల్లి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆమెను తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దంటూ అడ్డుకున్నారు. తాగు, సాగు నీటి సమస్యతో పాటు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల గురించి నిలదీశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ‌కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
 

Similar News