జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై లోకేశ్ కౌంటర్

Update: 2018-06-05 08:13 GMT

బీజేపీ నాయకుడు.. జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. యూసీలు సరిగ్గా లేవని చెప్పడానికి ఆయన ఎవరంటూ ట్వీట్ చేశారు. ఒకవేళ యూసీలు సరిగ్గా లేకపోతే.. కేంద్రంలోని సంబంధిత శాఖలు చూసుకుంటాయని.. తెలిపారు. అయితే ఆయా శాఖలన్నీ రాష్ట్రం పంపించిన యూసీలను ఆమోదించాయని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు కేవలం 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చిందన్న లోకేశ్.. ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి నెరవేర్చేందుకు యూసీలు అవసరమా అని.. లోకేశ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. 

Similar News