నల్గొండ టూటౌన్ సీఐ ఆచూకీ లభ్యం

Update: 2018-02-03 06:30 GMT

నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించింది. గుంటూరు జిల్లా బాపట్లలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసు విచారణ అధికారిగా ఉన్న సీఐ రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్లగొండ తీసుకొస్తున్నారు. ఆయన్ను నల్లగొండ ఎస్పీ ఎదుట హాజరుపర్చనున్నారు. సీఐ సమాచారం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు నల్లగొండకు బయలుదేరి వెళ్లారు. 

Similar News