నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళనల కారణంగా గత సమావేశాలు నీరుగారడంతో.. ఈసారైనా సభను సజావుగా నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం.. సభా కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు విపక్షాలు సహకరించాలని కోరింది. ఓ వైపు విభజన హామీలపై పార్లమెంట్లో చర్చ జరగాలని తెరాస ఎంపీలు కోరుతుండగా మరోవైపు.. టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో... పొలిటికల్ హీట్ రాజుకుంది.