కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ళ బాలుడిపై ఇద్దరు మైనర్ యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తిరువూరు నగర పంచాయతీలోని భగత్సింగ్లో నగర్లో ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఆరేళ్ళ బాలుడుని ఆడుకోవడానికని పిలిచారు. తినుబండారాలు ఇచ్చి అతన్ని మచ్చిక చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ బాలుడిని నిర్జన ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ్డారు. దీంతో బాలుడు కేకలు వేయడంతో యువకులు స్థానికులు చూసి వారిని తరిమారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలడ్ని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.