హైదరాబాద్ లో నేడు, రేపు పలు MMTS రైళ్ల రద్దు

Update: 2018-09-15 05:25 GMT

హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ అప్ గ్రేడేషన్ పనులు జరుగుతున్నందున ఈ రూట్లలో నడిచే MMTS రైళ్లను తాత్కాలికంగా క్యాన్సిల్ చేస్తున్నట్లు హైదరాబాద్ MMTS తెలిపింది. సౌత్ సెంట్రల్ రైల్వే. హైదరాబాద్-లింగపల్లి మధ్య నడిచే 10 ట్రైన్లను ఈ రోజు క్యాన్సిల్ చేశారు. అలాగే రేపు (సెప్టెంబర్-16) లింగంపల్లి-ఫలక్ నుమా మధ్య నడిచే 47171 నంబరు MMTS తో పాటు..హైదరాబాద్-లింగపల్లి మధ్య నడిచే 47100,4701 MMTS రైళ్లను ఆపేశారు. అంతేకాకుండా హైదరాబాద్-పూర్ణ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు లింగంపల్లి నుంచి ఈ రోజు రాత్రి 10.17 గంటలకు బయలుదేరుతుందని, హైదరాబాద్-కొచువెల్లి మధ్య నడిచే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 9.40కి బయలుదేరుతున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

Similar News