భార్యను చంపి బాత్‌రూంలో పాతిపెట్టాడు

Update: 2018-06-18 12:24 GMT

విజయనగరం జిల్లా వేంకంపేట గ్రామంలో రమణమ్మ అనే మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. భర్త నర్సయ్యే.. భార్యను చంపి బాత్రూంలో గోతి తీసి పాతిపెట్టాడు. రమణమ్మ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించారు. గతేడాది అక్టోబర్ 15 నుంచి రమణమ్మ కనిపించకుండా పోయింది. దీంతో.. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణమ్మ మిస్సింగ్ తర్వాత భర్త నర్సయ్య పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతడిని పట్టుకున్న పోలీసులు.. నిజం రాబట్టారు.

Similar News