రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు కులాంతర వివాహం చేసుకుని తన పరువు తీసిందన్న కారణంగా కిరాయి హంతకుల చేత అల్లుడిని దారుణంగా హతమార్చాడు మారుతీరావు. పరారీలో ఉన్న మారుతిరావును హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా పరువుకోసమే ప్రణయ్ ను హత్య చేయించినట్టు మారుతీరావు ఒప్పుకున్నాడు. తొమ్మిదో తరగతిలోనే తన కూతురు వెంట పడొద్దని ప్రణయ్ను హెచ్చరించానని అయినా మారలేదని, అందుకే చంపించానని ఒప్పుకున్నాడు. తన కూతురు మీద ప్రేమతోనే అతని హత్యకు ప్లాన్ చేశానన్నాడు. కూతరికి ఎలాంటి హానీ తలపెట్టొద్దని సుఫారీ గ్యాంగ్కు ముందే చెప్పినట్టు పోలీసుల ముందు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రణయ్ హత్యకోసం కిరాయి హంతకులతో10 లక్షలతో బేరం కుదుర్చుకుని ముందుగా ఐదు లక్షలు ఇచ్చినట్టు మారుతీరావు ఒప్పుకున్నాడు. కాగా ఈ కేసులో ఆయన తమ్ముడు శ్రవణ్కుమార్ ఏ2 నిందితుడుగా ఉన్నారు. శుక్రవారం ఘటన తరువాత కారులో పారిపోయిన నిందితులను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గురించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి పోలీసులు నిన్న (శనివారం) అదుపులోకి తీసుకున్నారు.