ప్రైవేట్ కంపెనీలో దారుణం.. బాలికపై అత్యాచారం

Update: 2018-01-03 08:44 GMT

విశాఖలో సమాజం తలదించుకునే ఘటన మరొకటి జరిగింది. మూగ బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది. తనకు జరిగిన అన్యాయం ఎవరి చెప్పుకోలేని స్థితిలో ఉన్న యువతి చివరికి తన సోదరుడి ద్వారా విషయాన్ని బయటపెట్టింది. ఇదే దారుణమంటే ఆ బదిర బాలిక శీలానికి వెలకట్టారు కొందరు నీచులు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ అఘాయిత్యం జరిగింది. విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న గిరిజన బదిర బాలికపై బస్సు డ్రైవర్ విశ్వనాథ్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు బాలిక శీలానికి వెలకట్టాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని లక్షన్నర ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం బాధిత బాలిక, డ్రైవర్ విశ్వనాథ్ మధ్య బేరం కుదిర్చింది. అందులో 25 వేలు కమీషన్ తీసుకొని న్యూ ఇయర్ వేడుకలు కూడా చేసుకున్నారు. అత్యంత నీచమైన ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సుమోటోగా అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడు విశ్వనాథ్‌తో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత బాలికకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖలో మహిళలకు భద్రతనేది ఉందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News