పొగరున్నందుకే తెలంగాణ కోసం పోరాడాను

Update: 2018-10-28 08:50 GMT

తెలంగాణలో ఎన్నికల వేళా నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు.  తాజాగా మంత్రి కేటీఆర్ టీపీసీసీ  అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. 'నాకు బరాబర్‌ పొగరు ఉంది. తెలంగాణలో పుట్టి ఉప్పు, కారం తినే ఏ బిడ్డకైనా రోషం, పొగరు ఉంటాయి. నీలా దద్దమ్మను కాను. పొగరున్నందుకే తెలంగాణ కోసం పోరాడాను'అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌నుద్దేశించి మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఉత్తమ్‌.. నాకు తెలివి లేదంటున్నారు. నిజమే నాకు తెలివి లేదు. మీలా కారు ఇంజన్లో 3కోట్లు తగలబెట్టుకునే తెలివి లేదు. దొంగలా బ్యాగులో 50లక్షలు తీసుకెళ్లి ఎమ్మెల్యేలను కొనే తెలివి లేదు’’అని ఎద్దేవా చేశారు. 

Similar News