Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్‌కు ఘన వీడ్కోలు

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావుకు పదోన్నతి.

Update: 2026-03-24 06:12 GMT

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్‌కు ఘన వీడ్కోలు

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్‌గా విశిష్ట సేవలందించిన పుల్లూరి జగదీశ్వరరావు పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు బదిలీ కావడంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది, వివిధ గ్రామాల విఆర్వోలు, కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News