ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

Update: 2018-12-07 07:00 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. బంజారాహిల్స్‌లోని సెయింట్ నిజామిస్ స్కూల్ లో మంత్రి కేటీఆర్ ఓటు హక్కు నియోగించుకున్నారు. ఓటు వేసేందుకు మంత్రి కేటీఆర్ క్యూలో కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు స్థానిక యువతీ యువకులు పోటీపడ్డారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓటు వేసిన వచ్చిన తరువాత, తన వేలికున్న సిరాను చూపుతూ "నాపై రంగు పడింది (iam inked), మీపై..?" అని కామెంట్ పెట్టారు. మీరు ఇంకా ఓటు వేయనట్లయితే, వెంటనే వెళ్లి ఓటేసి రండి అని కూడా వ్యాఖ్యానించారు.

Similar News