బతుకమ్మ చీరలు పంపిణీ చేద్దామనుకుంటే.. లేఖ..

Update: 2018-10-28 09:09 GMT

ప్రజల సంక్షేమాన్ని కోరుకునేది ఒక్క టిఆర్‌ఎస్ మాత్రమేనని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు తేల్చి చెప్పారు. టిఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని, కెసిఆర్ మళ్లీ సిఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు... సిద్ధిపేట పట్టణంలోని 23, 30 వార్డులలో హారీష్ రావు ప్రచారం నిర్వహించారు.. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను.. కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తామంటున్నారని ఆయన అన్నారు. బతుకమ్మ చీరలు పంపిణీ చేద్దామనుకుంటే ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసి అడ్డుకున్నారని ఆయన మండి పడ్డారు.

Similar News