సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్పై ఓ సినిమాని రూపొందిస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మహావ్యక్తి, మహానటుడు అయిన ఎన్టీఆర్ గురించి లక్ష్మీ పార్వతి కోణంలో సినిమా తీస్తానని, దానిని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే పేరుతో తెరకెక్కించనున్నానని వర్మ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై లక్ష్మీ పార్వతి వద్ద ప్రస్తావిస్తే.. 'ఎన్టీఆర్ వేదననే సినిమాగా తీయమని చెప్పాను. అలా చేస్తే ఆ సినిమాకి నా సపోర్ట్ ఉంటుందని చెప్పాను. అలా కాకుండా పిచ్చిరాతలు, కూతలు గనుక ప్రస్తావిస్తే క్షమించేది లేదం'టూ చెప్పుకొచ్చారు.
ఇక దీనికి వర్మ స్పందన ఎలా ఉందంటే.. 'మహానటుడు ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం. ఆయనని తక్కువ చేసేలా సినిమా ఎందుకు తీస్తాను. తప్పకుండా మంచి సినిమానే తీస్తాను' అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి ఎవర్ని ఎంపిక చేసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్పై ఓ సినిమా తీయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి 'నేనే రాజు నేనే మంత్రి' తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన తేజ దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.