ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశా: కొత్తపల్లి గీత

Update: 2018-08-24 09:54 GMT

ఎన్నికల యేడాదిలో ఏపీలో మరోకొత్త పార్టీ పురుడుపోసుకుంది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. కులాదిపత్య రాజకీయ పల్లకిని ఇక మోసేది లేదని గిరిజన, ఎస్సీ, ఎస్టీలకు నిజమైన రాజ్యాధికారంతో పాటు.. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జనజాగృతి కృషి చేస్తుందని కొత్తపల్లి గీత తెలిపారు. పార్టీ జెండా ఎజెండా ప్రకటించిన ఆమె.. మూడోవంతు సీట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోను విడుదల చేస్తామన్న ఆమె.. ఎంపీ పదవితో పాటు.. వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు. 

Similar News