టెలికాం దిగ్గజం జియో తమ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మానుసూన్ హంగామా పేరుతో ఈ నూతన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో బాగంగా పాత జియో ఫోన్ను ఎక్స్ఛేంజ్లో మార్చుకుని కొత్త ఫోన్ను పొందే సదుపాయాన్ని కల్పించింది. పాత జియో ఫోన్ను మార్చుకుని.. రూ. 501 చెల్లిస్తే కొత్త జియో ఫోన్ను ఇవ్వనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించగా ఈ ఆఫర్ జూలై 21 సాయంత్రం 5.00 గంటల నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్ కోసం మై జియో యాప్లో గానీ, జియో అధికారిక వెబ్సైట్లో గానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంస్థ సూచించింది. అంతేకాదు రూ. 501 చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం మొదట చెల్లించిన రూ. 1500 మాత్రమే రిఫండ్లో భాగంగా ఫోన్ కొన్న నాటి నుంచి మూడేళ్ల తర్వాత చెల్లిస్తారని జియో సంస్థ తెలిపింది.