జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. JFC పై మొదట శ్రద్ధ చూపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడే మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. నివేదికలో వెల్లడించిన అంశాలపై తదుపరి కార్యచరణ కొరవడిందన్న ఆయన ఇందుకోసం స్వతంత్ర నిపుణులతో మరో కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. తమ ప్రయత్నాన్ని రెండో దశ పోరాటంగా అభివర్ణించిన జేపీ కేంద్రం అవకాశం ఇస్తే వివరాలు తెలియజేస్తామన్నారు.